లక్నో : సమాజ్వాదీ సెక్యులర్ మోర్చా అధ్యక్షుడు శివపాల్ యాదవ్ బిజెపి కోసం పని చేస్తున్నట్లు స్పష్టమైందని సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బిఎస్పి) నాయకుడు, ఉత్తర్ ప్రదేశ్ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్భర్ అన్నారు. బిఎస్పి అధ్యక్షురాలు మాయావతి బంగ్లాను శివపాల్ యాదవ్కు కేటాయించడంతో ఈ విషయం తేటతెల్లమైందని రాజ్భర్ అలన్నారు. శివపాల్ యాదవ్కు బంగ్లా కేటాయించడం, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడం ద్వారా బిజెపి శివపాల్కు భద్రత కల్పిస్తోందని, శివపాల్ బిజెపి కోసం పని చేస్తున్నారని అర్థమవుతోందని రాజ్భర్ అన్నారు.