హైదరాబాద్ : తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హాజరయ్యారు. సమావేశంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కే కేశవరావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర్రావు, పద్మారావు, చందూలాల్, ఎంపీలు వినోద్, జితేందర్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ర్డెతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, విజ్ఞప్తులపై చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించనున్నారు.