హైదరాబాద్ : తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమీక్షించనుంది. 22న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానుంది. అదే రోజు సీఈసీ, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 23న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో, 24న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.