ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండగట్టు బాధితులకు పరిహారం మంజూరు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 17, 2018, 10:15 AM

జగిత్యాల: కొండగట్టు బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు,గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందజేయనున్నారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారాన్ని పంపిణీ చేసేందుకు అనుమతివ్వాలని ఎన్నికల కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరిన విష‌యం తెలిసిందే. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయడానికి ఎన్నికల కోడ్ నిబంధనలు వర్తింపుపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 62 మంది చనిపోగా, 17 మంది తీవ్రంగా గాయపడిన విష‌యం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com