ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌లో చేరిన షమి భార్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 17, 2018, 11:31 AM

క్రికెటర్‌ మహ్మద్‌ షమీ భార్య హసీన్‌ జహాన్‌ కాంగ్రెస్‌లో చేరారు. మంగళవారం ముంబయిలో ఆ ప్రాంత కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంజయ్‌ నిరుపమ్‌ ఆమెకు పుష్ప గుచ్ఛం అందించి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వృత్తి పరంగా మోడల్‌ అయిన హసీన్‌ జహాన్‌కూ, క్రికెటర్‌ మహ్మద్‌ షమీకి 2014లో వివాహమైంది. ప్రస్తుతం వీరిద్దరూ విడిపోయారు.


కొద్ది నెలల క్రితం తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసి హసీన్‌ వార్తల్లో నిలిచారు. భర్త తనను భౌతికంగా, మానసికంగా వేధిస్తున్నాడని, అంతేకాక అతనికి పలువురితో వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను, ఫోటోలను ఆమె బయటపెట్టారు. తనను చంపేందుకు ప్రయత్నించారని, పాకిస్థానీ మహిళ నుంచి డబ్బు తీసుకొని తన భర్త మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుదుర్చుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఏప్రిల్‌ 10న కోల్‌కతాలో హసీన్‌ షమీ సహా అతని కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు. తన భర్త నుంచి భరణం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఈ కేసులపై కోల్‌కతా పోలీసులు విచారణ జరుపుతున్నారు.


 


అయితే, తనపై భార్య చేసిన ఆరోపణలను క్రికెటర్‌ షమీ ఖండించారు. షమీపై వస్తున్న వరుస ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ అతణ్ని తొలుత దూరంగా ఉంచింది. తర్వాత క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com