నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో చోటు చేసుకున్న వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల, ముత్యాలమ్మగూడెం గ్రామాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. భద్రాద్రి కొత్తగూడెం ములకలపల్లి మండలం గంగారం అటవీప్రాంతంలోనూ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.