ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు వంతెనల మధ్య ఇరుక్కున్న బస్సు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 19, 2018, 10:58 AM

ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి రెండు వంతెనల మధ్య ఇరుక్కుపోయిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తెనాలి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం కొత్తగూడెం వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి రెండు వంతెనల మధ్య ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. బస్సు వంతెన నుంచి కింద పడకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com