అవినీతికి పాల్పడే క్రికెట్ బుకీల్లో ఎక్కువ మంది భారత్కు చెందినవారే ఉంటున్నారని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం శుక్రవారం వెల్లడించింది. శ్రీలంక క్రికెట్లో అవినీతిని నాశనం చేసేందుకు సహకరించని జయసూర్యపై ఇటీవల ఐసీసీ అభియోగాలు నమోదు చేయగా.. అక్కడి పరిణామాలకు భారత బుకీలే కారణమని పేర్కొంది. పాకిస్తాన్ ఆటగాడు కనేరియాకు డబ్బులిచ్చింది సైతం భారత బుకీనేనని ప్రపంచ వ్యాప్తంగా 12-20 మంది బుకీలు కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపింది.