హైదరాబాద్: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాంతో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు భేటీ అయ్యారు. ఈ ఉదయం తార్నాకలోని కోదండరాం నివాసానికి వీహెచ్ వెళ్లారు. దసరా సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఎన్నికల సమయం కావడంతో వీరిద్దరి భేటీపై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మహాకూటమికి సంబంధించిన అంశాలపై కోదండరాంతో వీహెచ్ చర్చించినట్లు సమాచారం.