ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగ్గురు ఉగ్రవాదులు హతం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 19, 2018, 12:09 PM

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉరి సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు గురువారం ఉదయం బలగాలకు సమాచారం అందింది. దీంతో అక్కడ భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో బలగాలు పహారా కాస్తున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com