శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉరి సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు గురువారం ఉదయం బలగాలకు సమాచారం అందింది. దీంతో అక్కడ భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో బలగాలు పహారా కాస్తున్నాయి.