భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ మరోసారి కదం తొక్కాడు. డెన్మార్క్ ఓపెన్లో భాగంగా చైనాకు చెందిన మరో స్టార్ ఆటగాడు లిన్డాన్ను మట్టికరిపించాడు. రెండుసార్లు ఒలింపిక్ విజేత అయిన లిన్డాన్తో గురువారం జరిగిన పోరులో 18-21, 21-17, 21-16 తేడాతో శ్రీకాంత్ ఓడించాడు. హోరాహోరీగా సాగిన ఆటలో శ్రీకాంత్దే పైచేయి అయింది. ఈ విజయంతో క్వార్టర్ఫైనల్లో సమీర్వర్మను ఢీకొననున్నాడు.
లిన్డాన్ రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత కాగా, అయిదుసార్లు వరల్డ్ ఛాంపియన్. లిన్డాన్-శ్రీకాంత్లు మొత్తం అయిదుసార్లు తలపడ్డారు. 2016 రియో ఒలింపిక్స్లోనూ వీరిద్దరూ బరిలో దిగగా, విజయం లిన్డాన్ను వరించింది. 2014లో చైనా ఓపెన్లో శ్రీకాంత్ తొలిసారి డాన్ను ఓడించాడు.
ఇక శుక్రవారం జరిగే క్వార్టర్ఫైనల్లో భాగంగా మరో భారత క్రీడాకారుడు సమీర్ వర్మతో శ్రీకాంత్ పోటీపడనున్నాడు. 2018 ఆసియా క్రీడల్లో వర్మ బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే!