హైదరాబాద్ లోని లక్డీకపూల్ లో ఉన్న ఓ హోటల్ లో ప్రజాకూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా, తెలంగాణ జనసమితి నేత కోదండరామ్ లు పాల్గొన్నారు. కూటమిలోని పార్టీ అధ్యక్షులను కాంగ్రెస్ సమావేశానికి పిలిచింది. టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిలు హాజరుకానున్నారు.