ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్వపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జగదీశ్ రెడ్డి పూజలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 19, 2018, 03:09 PM

 మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దేవాలయం అభివృద్ధికి మంత్రి ప్రత్యేక నిధులు కేటాయించారు. కోటి రూపాయల నిధులు మంజూరు చేశారు. కేంద్ర జలవనరుల సంఘం మాజీ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు దివంగత ఆర్ విద్యాసాగర్ రావు అభ్యర్థన మేరకు ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారు. ఆర్ విద్యాసాగర్‌రావుది అర్వపల్లి మండలంలోని జాజిరెడ్డిగూడెం. ఇప్పటికే ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయి. పలుమార్లు సీఎం కేసీఆర్ కూడా దేవాదాయ శాఖాధికారులతో ఆలయ అభివృద్ధిపై సమీక్షించార










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com