తెలంగాణ తొలిప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి అయిన కడియం శ్రీహరి తెరాస పార్టీలో విబేధాలు వచ్చాయని అయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. దీనికితోడు తెరాస ప్రభుత్వంలోని ఉపముఖ్యమంత్రి తమ పార్టీలో చేరనున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్పడంతో ఊహాగానాలపై నమ్మకం ఏర్పడింది. అయితే ఈ ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు కడియం. ఈరోజు వరంగల్ లో మీడియాతో మాట్లాడిన కడియం తాను కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ టచ్లో వున్న ఉపముఖ్యమంత్రి ఎవరో చెప్పాలని మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ ను డిమాండ్ చేశారు.. లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.