షిర్డి : మానవాళికి షిర్డి సాయిబాబా సందేశాలు ప్రేరణగా నిలిచాయని ప్రధాని మోడీ అన్నారు. షిర్డీ వెళ్లిన మోడీ అక్కడ బాబా దర్శన అనంతరం విజిటర్స్ బుక్లో ఇలా రాశారు. సాయిబాబా దర్శనం తర్వాత తనకు ఎంతో మానసిక ప్రశాంతతకు గురైనట్లు చెప్పారు. బాబా బోధించిన విశ్వాసం, సహన సూత్రాలు మానవాళిని ఆకట్టుకున్నాయన్నారు. విశ్వాసం, సహనంపై ఆయన చేసిన బోధనలు మానవాళికి ప్రేరణగా నిలిచాయన్నారు. సమానత్వానికి షిర్డి సాక్ష్యంగా నిలుస్తుందని, అన్ని మతాలకు చెందిన ప్రజలు బాబా ముందు వంగి నమస్కరిస్తారని ఆయన తెలిపారు. సాయిబాబా బోధించిన సబ్ కా మాలిక్ ఏక్హై అన్న సూత్రం ప్రపంచ శాంతికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు