ఈనెల 21వతేదీన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు తెలంగాణ భవన్ లో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అభ్యర్థులతో స్వయంగా మాట్లాడనున్నారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థులుగా వ్యవహరించాల్సిన పద్దతులపై అవగాహన కల్పించనున్నారు. పార్టీ ప్రకటించిన 105మంది అభ్యర్థులు విధిగా హాజరుకావాలని ఆదేశించారు.