కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డిలు నాందేడ్ బయలుదేరారు. శంషాబాద్ నుంచి కుంతియా, ఉత్తమ్లు హెలికాప్టర్లో నాందేడ్ బయల్దేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉదయం 11.30 గంటలకు నాందేడ్ చేరుకోనున్నారు. రాహుల్గాంధీకి నేతలు కుంతియా, ఉత్తమ్లు స్వాగతం పలకనున్నారు. రాహుల్తో కలిసి కుంతియా, ఉత్తమ్లు హెలికాప్టర్లో భైంసా రానున్నారు. భైంసాలో జరిగే ఎన్నికల ప్రచార సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి కామారెడ్డి సభకు హాజరు కానున్నారు. సాయంత్రం హైదరాబాద్ రానున్నారు.