ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, మాజీ కేంద్రమంతి దత్తాత్రేయ, తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారావు తదితరులు శనివారం ఢిల్లీలో కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను నేతలు అమిత్ షాకు అందజేశారు. అయితే... ఈ జాబితాను బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలో పరిశీలించిననంతరం అభ్యర్థులను ప్రకటించనున్నారు.