స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆపదలో ఉన్న వారికి ఎల్లప్పుడు తన వంతు సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తిత్లీ తుఫాను వలన నిరాశ్రయిలన వారికి అండగా నిలిచేందుకు 25 లక్షల ఆర్ధిక సాయం అందిస్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. తిత్లీ ఎందరో జీవితాలలో విషాదం నింపిందని తెలిసి కలత చెందాను. అందుకే వారికి నా వంతు బాధ్యతగా విరాళం అందిస్తున్నాను. మీరు కూడా మీకు తోచినంత సాయం చేసి ఇబ్బందులలో ఉన్న వారిని ఆదుకోండి అని పిలుపునిచ్చారు బన్నీ. తెలుగు రాష్ట్రాలలోనే కాక పక్క రాష్ట్రాలలోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం తర్వాత ఏ సినిమాకి కమిట్ కాలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలోనో లేదంటే విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనో బన్నీ తదుపరి సినిమా ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.