తెరాస సర్కార్ హయాంలో అవినీతి పెచ్చరిల్లిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ విమర్శించారు. భైంసాలో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన మట్లాడుతున్నారు. అవినీతితో కేసీఆర్ కుటుంబం కోట్లు దండుకుంటోందని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, రక్షణ కోసం యూపీఏ సర్కార్ తీసుకువచ్చిన విధానాలను తెరాస సర్కార్ పక్కన పెట్టేసిందన్నారు. ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తామన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు…ఈ వాగ్దానాలన్నీ ఏమయ్యాయని రాహుల్ ప్రశ్నించారు.