చెన్నూరు : చెన్నూరు తెరాస అభ్యర్థి బాల్క సుమన్ నామినేషన్ కోసం షెట్పల్లి ప్రజలు ఐదు వేల రూపాయల విరాళాన్ని అందించారు మంగళవారం జైపూర్ మండలంలో ఇంటింటా ప్రచారానికి వెళ్లిన సుమన్ కు గ్రామస్తులు నగదు అందించారు. భారీ మెజార్టీతో గెలిచిన అనంతరం గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. నియోజకవర్గంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో మంగళహారతులతో స్వాగతం పలికారు.