కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరో కూడా చెప్పలేని స్థితిలో ఉందన్నారు తెరాస నేత కేటీఆర్. స్టేషన్ ఘనపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలుచోట్ల మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామన్న ఆయన పేదలు ఎక్కడ ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇప్పటికే 200 కేసులు పెట్టారని.. చనిపోయిన వాళ్ళ పేరు మీద కేసులు పెట్టడం దుర్మార్గం అన్నారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా గల్లంతయ్యేలా తెరాసను గెలిపించాలని కోరారు.