ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీబీఐ నూతన డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 24, 2018, 09:51 AM

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ నూతన డైరెక్టర్‌గా తెలంగాణకు చెందిన మన్నెం నాగేశ్వరరావు నియమితులయ్యారు. మన్నెం నాగేశ్వరరావును నూతన సీబీఐ అధిపతిగా నియమిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరావు తక్షణమే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. సీబీఐలో సంక్షోభం తలెత్తడంతో రాత్రికి రాత్రే కొత్త డైరెక్టర్‌ను మోదీ ప్రభుత్వం నియమించింది. అంతర్గత పోరుతో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ప్రధాని మోదీ తప్పించారు. 


1986 బ్యాచ్‌కు చెందిన నాగేశ్వరరావు ఒడిశా కేడర్‌లో విధులు నిర్వర్తించారు. గతంలో ఒడిశా డీజీగా కూడా పనిచేశారు. విజయరామారావు తర్వాత తెలంగాణ అధికారికి సీబీఐ డైరెక్టర్ అవకాశం వచ్చింది. నాగేశ్వరరావు స్వస్థలం వరంగల్ జిల్లా మండపేట మండలం బోర్‌నర్సాపూర్ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఏడాదిన్నరగా సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com