ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంగారెడ్డి కోర్టు అదనపు జడ్జి వరప్రసాద్‌ అరెస్ట్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 15, 2018, 08:09 AM

రంగారెడ్డి కోర్టు అదనపు జడ్జి వరప్రసాద్‌ ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దీంతో వరప్రసాద్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించారు. చంచల్‌గూడ జైలుకు వరప్రసాద్‌ను తరలించాలని ఆదేశించారు. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వరప్రసాద్‌ నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. రూ.3కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com