హైదరాబాద్ : తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఎపిలో కలపడంపై కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. పోలవరం ముంపు మండలాలు ఏడింటిని ఎపిలో విలీనం చేశారు. ఎపిలో విలీనమైన ఈ మండలాల నియోజక వర్గాలను పునర్విభజన చేయాలని కోరుతూ శశిధర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు పునర్విభజన చేశాకే తెలంగాణాలో ఎన్నికలు జరపాలని శశిధర్ రెడ్డి కోర్టును కోరారు. . దీనిని హైకోర్టు కొట్టివేసింది.