హైదరాబాద్ :తెలంగాణ భవన్లో పలు మీడియా ప్రతినిధులతో ఎంపీ కవిత చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కొత్తగా సెటిలర్లపై కాంగ్రెస్కు ప్రేమ పుట్టుకువచ్చిందన్నారు. అందుకే కుసుమ కుమార్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. కమ్మ వర్గానికి అన్యాయం జరిగిందని.. ఈ నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేస్తారని రేణుకా చౌదరి అంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో టీడీపీని తిరస్కరిస్తారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్తారు అని చెప్పారు. రూరల్, అర్బన్ అనే తేడా లేదు.. అంతటా టీఆర్ఎస్ హవానే అని ఆమె స్పష్టం చేశారు. నగరంలోని సెటిలర్లంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని ఆ పార్టీ ఎంపీ కవిత స్పష్టం చేశారు. అభివృద్ధి చేసే వారికి సెటిలర్లు పట్టం కడుతారని.. టీఆర్ఎస్ను గెలిపించుకుని వారి హక్కుగా అభివృద్ధి చేయించుకుంటారని కవిత తెలిపారు. టీఆర్ఎస్కు వందకు పైగా స్థానాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో మెజార్టీ సీట్లు గెలుస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని వ్యాఖ్యానిస్తున్న ఉత్తమ్ కుమార్రెడ్డి తన భార్యకు టికెట్ ఎలా తీసుకుంటారని కవిత ప్రశ్నించారు. ఉత్తమ్ తన భార్యకు టికెట్ ఉపసంహరించుకోవాలి. అప్పుడైనా గౌరవం దక్కుతుందన్నారు. కోదాడలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు.