న్యూఢిల్లి : అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి మంచి సమయమిదని ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎంఆర్ఎం) నాయకుడు యాసిర్ జిలానీ అన్నారు. డిసెంబర్ దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలను ఒక చోట చేర్చడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఢిల్లిలోని రామ్లీలా మైదానంలో 25 వేల మంది ముస్లింలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారతదేశంలోని ముస్లింలందరూ రామ మందిర నిర్మాణానికి ఇది తగిన సమయమని భావిస్తున్నారనే సందేశాన్ని తాము ఈ సదస్సునుంచి అందరికీ తెలియజెపుతామని ఆయన అన్నారు.