హైదరాబాద్ : రేవంత్ రెడ్డి గారి తో కాంగ్రెస్ లోకి వెళ్లిన వారికి కాంగ్రెస్ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి అందరికి తెలుసు .కానీ ఒక సీతక్క కు తప్ప ఎవరికీ అవకాశం ఇవ్వలేదు .పలుమార్లు ఢిల్లీ వెళ్లి గుర్తుచేసినా వారు భజనపరులకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది .రేవంత్రెడ్డి గారికి ప్రచారకమిటీ హామీ కూడా ప్రక్కనపెట్టడం వెనుక పెద్ద స్కెచ్ ఉందని అందరికి తెలుసు .తనవర్గానికి టికెట్లు ఇప్పించుకోలేక పోయానన్న బాధ రేవంత్ రెడ్డిగారికి ఉంది .రేవంత్ రెడ్డి వర్గానికి టికెట్లు ఇవ్వకుండా అడ్డుపడ్డ వారికి రేవంత్ ఆధిపత్యాన్ని ఆపేసి విజయం సాధించాం అనుకోని సంబరాలు చేసుకొంటున్నారు .ఆగమేఘాలమీద మూడవ వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించడం వెనుక కాంగ్రెస్ కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది .ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నేతల గెలుపు ప్రచారానికి వెళ్లకపోతే సగానికిపైగా ఓటమి చూడాల్సిన పరిస్థితి .టికెట్లు తెచ్చుకొన్న నాయకులు రేవంత్ రెడ్డి గారి ప్రచార హామికోసం పడిగాల్పులు పడటం విశేషం .