తనపై నమ్మకం ఉంచి పోటీ చేసే అవకాశమిచ్చినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేబుతున్నానని కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను ప్రజలకు సేవ చేస్తానని చంద్రబాబు నమ్మారని, అందుకు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి నందమూరి హరికృష్ణను ఆమె గుర్తుచేసుకున్నారు. టీడీపీకి ఆయన ఎంతో సేవ చేశారని అన్నారు. చిన్నప్పటి నుంచి తనకు రాజకీయాలంటే ఇష్టమని, తన తాత నందమూరి ఎన్టీ రామారావు, తండ్రి హరికృష్ణ, మామయ్య చంద్రబాబునాయుడు తనకు ఎంతో స్ఫూర్తి నిచ్చారని అన్నారు. తన మామ మాజీ ఎంపీ అని, ఆయన స్ఫూర్తి కూడా తనపై ఉందని ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తన తాతయ్య ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, ఇది ప్రజల పార్టీ స్థాపించారని అన్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, ప్రజల కోసం అనునిత్యం కష్టపడి పని చేస్తానని అన్నారు. అందరి ఆశీర్వాదాలు తనకు కావాలని, రేపు నామినేషన్ వేసిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పారు.