తెలంగాణలో పాలన కేవలం నలుగురి చేతిలోనే ఉందని ఏఐసీసీ అధికార ప్రతినిథి, సినీనటి ఖుష్బు విమర్శించారు. జడ్చర్లలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఖుష్బు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కేసీఆర్ కుటుంబానికి చెందన నలుగురు పాలిస్తున్నారన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు అడ్డకట్ట వేసేది కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. కేసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా స్థానం లేదని విమర్శించారు. బతుకమ్మ చీరల పేర రెండు వందల పాతిక కోట్ల రూపాయాలు పక్కదారి పట్టాయని ఆరోపించారు.