హైదరాబాద్: తాత ఎన్టీఆర్, నాన్న హరికృష్ణ, బాలకృష్ణ ఆశీస్సులతో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని అన్నారు. మరికాసేపట్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న ఆమె ముందగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగు మహిళల మద్దతు కోరుతున్నానన్నారు. కాగా మహాప్రస్థానంలో తండ్రి హరికృష్ణకు నివాళులు అర్పించిన అనంతరం ఉదయం 11.21 గంటల సమయంలో ఆమె కూకట్పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.