హైదరాబాద్ : సనత్నగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్రెడ్డికి ఆ పార్టీ షాక్ ఇచ్చింది. మహాకూటమి పొత్తులో భాగంగా సనత్నగర్ను టీడీపీకి కేటాయిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దీంతో సనత్నగర్ అభ్యర్థిగా కూన వెంకటేశ్గౌడ్ పేరును టీడీపీ ఖరారు చేసింది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కూన వెంకటేశ్గౌడ్ తలపడబోతున్నారు. మరోవైపు సనత్నగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న మర్రి శశిధర్రెడ్డికి ఈ సారి నిరాశే ఎదురైంది.