హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలు ముస్లింలను ఓటు వేసే యంత్రాలుగానే చూసినవని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని నాంపల్లిలో గల రోస్ గార్డెన్స్లో నేడు మైనార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అన్ని మతాల్లోని పేదలకోసం సంక్షేమ పథకాల రూపకల్పన చేశామన్నారు. హైదరాబాద్లో ఎలాంటి భయం లేకుండా అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు జీవిస్తున్నారని తెలిపారు. ముస్లింల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పేద ముస్లిం యువతుల పెళ్లి కోసం షాదీముబారక్ అమలు చేస్తున్నట్లు వివరించారు.