నామినేషన్ల గడవు ముంచుకొస్తున్నా మహాకూటమిలో సీట్ల సర్దుబాటు మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. కూటమిలో భాగస్వామ్య పక్షాలను కేటాయించిన సీట్లుపోను ఇంకా ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఒకచోట మిత్రపక్షాలు పోటీ పడుతుండగా, మరొకచోట ఒకే పార్టీలోనే నేతలు తాము చూసించిన అభ్యర్థికే టికెట్ దక్కలని భీష్మించుకుని కూర్చున్నారు. నేతల మంకుపట్టతో ఇంకా ఎనిమిది స్థానాల్లో అభ్యర్థులు తేల్చుకోలేని పరిస్థితి మహాకూటమిలో ఉంది.
కాంగ్రెస్ సీనియర్నేత మర్రి శశిధర్ రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. ఆయన కోరుకున్న సనత్ నగర్ టీడీపీకి కేటాయించడంతో సికింద్రాబాద్ నుంచి పోటీకి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కూడా పోటీ తీవ్రంగా ఉంది. ఈ స్థానంలో టికెట్ కోసం నగర మాజీ మేయర్ బండా కార్తిక రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ పోటీ పడుతున్నారు. వారిని కాదని శశిధర్ రెడ్డికి టికెట్ దక్కుతుందో లేదో అన్న అంశం అసక్తిగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్లలో కూడా ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. ఇక్కడి నుంచి జువ్వాడి నర్సింగరావు, కొమిరెడ్డి రాములు తీవ్రంగా పటీ పడుతున్నారు. నారాయణ ఖేడ్ నుంచి సురేష్ షెట్కార్, సంజీవ రెడ్డిలు టికెట్ కోసం నేతలతో మంతనాలు చేస్తున్నారు. ఇక వరంగల్ ఈస్ట్లో గాదె ఇన్నయ్య, వద్దిరాజు రవిచంద్ర పోటీ పడుతున్నారు. మిర్యాలగూడ సీటు కోసం జానారెడ్డి తనయుడు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. నామినేషన్లకు గడవు లేకపోవడంతో రేపు సాయంత్రంలోపు ఈ స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది.