టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు. అంతకముందు హుజూర్నగర్లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉత్తమ్ ప్రత్యేక పూజలు చేశారు. ఇక..టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.