కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నామినేషన్లు వేసేందుకు అందరికీ అనుమతిలిచ్చి తనకే కావాలని అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. తన నామినేషన్ వేయకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రైవేట్ సైన్యం నడుస్తోందని ఆరోపించారు. అక్రమ కేసులతో కాంగ్రెస్ నేతలను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసుల పేరుతో తన నామినేషన్ కు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్ ను టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చేశారని రేవంత్ ధ్వజమెత్తారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిపై 36 కేసులు ఉన్నాయి. ఓటుకు నోటు కేసు తో సహా మెుత్తం 36 కేసులు ఈ నాలుగు ఏళ్లలో నమోదయ్యాయి. 2014 ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్లో ఒక్క కేసు కూడ లేదు. కానీ, ఈ నాలుగేళ్లలో మాత్రమే రేవంత్ రెడ్డిపై 36 కేసులు నమోదయ్యాయి.