నల్లగొండ: జిల్లాలోని చింతపల్లి మండలం దేనతండా అదేవిధంగా కొండామల్లేపల్లి మండలం కేశ్యాతండాలో అధికారులు నేడు ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ రంగనాథ్ విచ్చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఈ సందర్భంగా ఓటర్లకు అవగాహన కల్పించారు.