మహాకూటమి ఏర్పాటుకు కేసీఆర్ నియంతృత్వమే కారణమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. ఈ రోజు మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైన సీఎం అని ఎద్దేవా చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడే నీటి పారుదల ప్రాజెక్టులు చేపట్టారని ఆరోపించారు. కేటీఆర్కు రాజకీయ సన్యాసం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టీడీపీ పెద్ద పీట వేసిందని రమణ తెలిపారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. పెన్షన్లు, నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఎల్. రమణ స్పష్టం చేశారు. బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని రమణ అన్నారు.