హైదరాబాద్: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు ప్రచార పర్వాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈనెల 23 న ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. 23 న సోనియా తెలంగాణలో రెండు బహిరంగ సభలలో పాల్గొననున్నారు. ఇప్పటికే నేతలు సోనియా సభ ఏర్పాట్ల మీద దృష్టి సారించారు. సభలు ఎక్కడ అన్నది ఇంకా ఖరారు కాలేదు కానీ సోనియా సభలు పార్టీకి కలిసివస్తాయని కాంగ్రెస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.