హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ వణుకు పుట్టిస్తున్నారు. ముఖ్యంగా టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన అనేకమంది నేతలు రెబల్స్ బరిలోకి దిగారు. దీంతో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో ఉంది కాంగ్రెస్. ఓవైపు అసంతృప్తుల నిరసనలు... మరోవైపు హైకమాండ్ బుజ్జగింపులతో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ తీరుపై మాజీ మంత్రి శంకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శంకర్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. షాద్ నగర్ కాంగ్రెస్ టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు. డోర్నకల్ కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ ముట్టడించారు. డోర్నకల్ టికెట్ నెహ్రూకు కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు. బి-ఫామ్ రామచంద్రనాయక్ ఇస్తే రాజీనామా చేస్తామని ఆందోళనకు దిగారు.