ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు ఇంటింటి ప్రచారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 18, 2018, 12:48 PM

ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆదివారం మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మండలంలోని నాగార్జున కాలనీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు , మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి లు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. కారు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అరవింద్ రెడ్డి మాట్లాడుతూ, మంచిర్యాల ఎమ్మెల్యేగా దివాకర్ రావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు, సింగరేణి కార్మికులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com