ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆదివారం మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మండలంలోని నాగార్జున కాలనీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు , మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి లు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. కారు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అరవింద్ రెడ్డి మాట్లాడుతూ, మంచిర్యాల ఎమ్మెల్యేగా దివాకర్ రావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు, సింగరేణి కార్మికులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.