తెలంగాణ రాష్ట్రం ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యయాలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు మొదలు పెట్టింది. పది వేలకు మించి చేసే ప్రతి ఖర్చు అకౌంట్ ఫర్గా జరగాలని ఆదేశించింది. ఎన్నికల అధికారి దానకిశోర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో రూ.20 వేల వరకు నగదు రూపంలో చెల్లించే అవకాశం ఉండేది. దీన్ని సగానికి తగ్గించింది. అభ్యర్థులు తప్పనిసరిగా తమ పేరున బ్యాంక్ అకౌంట్ తెరవాలని, ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వ్యయాలన్నీ ఆ అకౌంట్ నుంచే జరగాలని సూచించారు. వ్యక్తులు, సంస్థలకు పది వేలకు మించి చెల్లించాల్సి వస్తే చెక్, ఆర్టీజీఎస్ బదలాయింపు, డీడీ రూపంలో ఇవ్వాలని కోరింది. ప్రచారానికి సంబంధించిన వ్యయాలకు ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని కోరింది.