ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరే పల్లిలో టిఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఇంటింటి ప్రచారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 18, 2018, 01:54 PM

కరీంనగర్ మండలం లోని ఆరే పల్లి గ్రామంలో టిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి గంగుల కమలాకర్ ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన గంగులను మహిళలు మంగళ హారతులతో ఘనంగా ఆహ్వానించారు. కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని తాజా మాజీ ఎమ్మెల్యే, తెరాసా అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. ఈరోజు  మానేరు రిజర్వాయర్ కట్టపై ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ మానేరు రివర్ ఫ్రంట్ తో.కరీంనగరంలో అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారనున్నదన్నారు. స్థానిక ప్రజలు 20 ఏళ్లుగా తనను గెలిపిస్తూ వస్తున్నారని వాళ్ల రుణం తీర్చుకుంటానని చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రివర్ ఫ్రంట్ గా ఇది చరిత్రకెక్కుతుందని అన్నారు. నగర అభివృద్ధి కోసం దాదాపు 620 కోట్లతో ప్రణాళికలు రూపొందించామన్నారు. డ్యాం కట్టనుండి చేగుర్తి వరకు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు జనవరిలో పూర్తి కానున్నాయని చెప్పారు. పలువురు వాకర్స్ మాట్లాడుతూ నగర అభివృద్ధి కి నిరంతరం కృషి చేస్తున్న గంగుల కమలాకర్ ను గెలిపించుకుంటామని , టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్డు మధ్యన ఉన్న హైటెన్షన్ స్తంభాలను తొలగించిన ఘనత గంగులదేనన్నారు. మానేరు తీర ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం 175 ఎల్ఈడీ లైట్లను నెలకొల్పడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఆయనతో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ, గౌడ్ ఆకారపు భాస్కర్రెడ్డి, ఎంపీపీ వాసాల రమేష్, జెడ్పిటిసి ఎడ్ల శ్రీనివాస్ ఎంపిటిసి బాలయ్య. సుంకిశాల సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com