హైదరాబాద్: కాంగ్రెస్ తుది జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. మిగిలిన ఆరు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక సాయంత్రంలోగా పూర్తికానుంది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆమోదం తెలిపిన వెంటనే ఏఐసీసీ జాబితాను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. కాగా ఆరు స్థానాలకు గాను రెండు, మూడు స్థానాల్లో టీడీపీ, టీజేఎస్ మధ్య అవగాహన కుదరాల్సి ఉంది. మరోవైపు సీట్ల కోసం ఆశావాహులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. మిర్యాలగూడ, నారాయణ్పేట, నారాయణఖేడ, కోరుట్ల, హుజూరాబాద్, దేవరకద్ర స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేయనుంది.