హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, కృష్ణా-గోదావరి నదులు అనుసంధానం చేసి సాగునీరు అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే గోదావరి జలాల సద్వినియోగానికి 9 బ్యారేజీలు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. మూడు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని, ఇళ్లులేని పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల ప్రచారానికి 20 మంది స్టార్ క్యాంపెయినర్లను కూడా తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది.
బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు:
రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ
కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేసి సాగునీరు అందిస్తాం
గోదావరి జలాల సద్వినియోగానికి 9 బ్యారేజీలు నిర్మిస్తాం
మూడు నెలల్లో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తాం
ఇళ్లులేని పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తాం
గొర్రెల పెంపకందారుల సబ్సిడీని 20 వేల నుంచి 50 వేలకు పెంచుతాం
ఉచితంగా విద్యార్థులకు సైకిళ్లు, కాలేజీ విద్యార్థులకు స్కూటీలిస్తాం
డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు
ప్రతి పేద కుటుంబానికి రూ.5లక్షల ఆరోగ్య బీమా
ఉపాధి హామీ కూలీలకు ఉచిత అల్పాహారం
అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం