హైదరాబాద్: ఈనెల 23న మేడ్చల్లో జరిగే సోనియా గాంధీ బహిరంగ సభకు కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మేడ్చల్లో బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, టీపీసీసీ నేత మల్లు భట్టివిక్రమార్క, మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి కె.లక్ష్మారెడ్డి పరిశీలించారు. సోనియా బహిరంగ సభకు మూడు లక్షల మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు తెలిపారు.