హైదరాబాద్: గాంధీభవన్ దగ్గర యాదవ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. యాదవులకు కేవలం ఒక్క టికెట్ మాత్రమే కేటాయించడంపై నిరసన తెలుపుతున్నాయి. యాదవులకు కనీసం 5 టికెట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తామని యాదవులు హెచ్చరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. యాదవులకు అన్యాయం చేశారంటూ మండిపడుతున్నారు. సీట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.