ఆసిఫాబాద్: సిర్పూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హరీష్ బాబు, ఆ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ సభ్యురాలు విజయశాంతి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి ప్రాణహిత నది పర్యటన చేశారు. నది వద్దకు ప్రత్యేక పడవలో బయలు దేరిన నేతలు నది పరిసరాలు, ప్రాజెక్టు వివరాలను పరిశీలించారు.