హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి శంకర్రావు రాజీనామా చేశారు. అనంతరం ఆయన సమాజ్వాదీ పార్టీలో చేరారు. త్యాగాలు చేసిన వారిని మరిచి పైరవీలు చేసే వారికే కాంగ్రెస్ టికెట్లు ఇస్తోందని శంకర్రావు మండిపడ్డారు. బలహీనవర్గాల కాంగ్రెస్.. రెడ్ల కాంగ్రెస్గా మారింది. కాంగ్రెస్ నాకు తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ టికెట్ ఆశించి శంకర్రావు భంగపడ్డారు.