హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ మరో రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితాను కేసీఆర్ ఇవాళ విడుదల చేశారు. కోదాడ స్థానం నుంచి బొల్లం మల్లయ్య యాదవ్, ముషీరాబాద్ నుంచి ముఠా గోపాల్కు టికెట్లను కేటాయించారు. నేటితో 119 స్థానాలకు గులాబీ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నవారివైపు అధిష్టానం మొగ్గుచూపింది.